సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కంటివెలుగు 43 వ రోజుకు చేరుకుంది. గురువారం 274 కేంద్రాల్లో 27,259 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3,075 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 1949 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
నగరంలో 115 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వెల్లడించారు. 43వ రోజు మొత్తం 8,960 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 1290 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. 714 మంది రోగులకు ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా పరిధిలో మొత్తం 80 కేంద్రాల ద్వారా కంటివెలుగు కార్యక్రమం జరిపినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 43వ రోజు జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,414 మందికి కంటి పరీక్షలు జరిపామని, వారిలో 870 మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 803 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేశామన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో మొత్తం 79 కేంద్రాల ద్వారా 43వ రోజు 8,885 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 915 మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశామని, 432 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు తెలిపారు.