కేపీహెచ్బీ కాలనీ, జూలై 27: జేఎన్టీయూహెచ్ వర్సిటీలో నేషనల్ వర్క్షాప్ ఆన్ ప్రీ ప్యాబ్రికేటేడ్ బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్ (ఎన్డబ్ల్యూపీబీసీ)2021 గోడపత్రికను వర్సిటీ వైస్ చాన్స్లర్ కట్టా నరసింహారెడ్డి, ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు మంగళవారం ఆవిష్కరించారు. జేఎన్టీయూహెచ్ వర్సిటీ, ఎన్ఐటీ వరంగల్ సంయుక్తంగా వర్సిటీలోని యూజీసీ ఆడిటోరియంలో ఈనెల 29,30 తేదీల్లో ఎన్డబ్ల్యూపీబీసీ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 15 మందికి పైగా సజ్జెక్ట్ నిపుణులు పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు, మౌలిక సదుపాయాల నిర్వాహకులు, బిల్డర్లు, సామగ్రి తయారీదారులు, ఇంజినీర్లు, విద్యావేత్తలకు సదస్సు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రభుకుమార్, సివిల్ ఇంజినీరింగ్ విభాగం అధిపతి శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.