జలమండలి ఆధ్వర్యంలో నాణ్యమైన తాగునీరు
వర్షాల నేపథ్యంలో స్వయంగా పరీక్షించిన ఎండీ దానకిశోర్
సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. బుధవారం ఆయన బేగంపేటలోని పాటిగడ్డ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించి తాగునీటి నాణ్యతను స్వయంగా పరీక్షించారు. సరైన నాణ్యతతో నీటి సరఫరా అవుతోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలతో నేరుగా మాట్లాడి నీటి సరఫరా ఎలా జరుగుతుందో ఆరా తీశారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నందున కలుషిత నీరు సరఫరా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎండీ తెలిపారు. జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియను అవలంబిస్తున్నామని చెప్పారు.
ప్రతి రోజూ 15వేల క్లోరిన్ పరీక్షలు
మొదటి విడతగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల(డబ్లూటీపీ) వద్ద క్లోరినేషన్ ప్రక్రియ జరుపుతున్నామని ఎండీ తెలిపారు. రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల(ఎంబీఆర్) వద్ద క్లోరినేషన్ చేస్తున్నట్లు చెప్పారు. చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ చేయిస్తున్నట్లు పేరొన్నారు. ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎండీ దానకిశోర్ చెప్పా రు. నగర ప్రజలకు శుద్ధమైన నీరు అందించేందుకు ఐఎస్వో 10500-2012 ప్రకారం శాస్త్రీయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను జలమండలి తీసుకుంటోందని అన్నారు. ప్రతీ రోజూ నగరవ్యాప్తంగా 15 వేల క్లోరిన్ పరీక్షలు చేస్తోందని తెలిపారు.
క్లోరిన్ బిళ్లల పంపిణీ
నగరంలోని బస్తీలు, వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి సరఫరాపై జలమండలి మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఎండీ దానకిశోర్ పేరొన్నారు. ప్రజలు ఇళ్లలో నిల్వ చేసిన నీటిని శుద్ధి చేసుకోవడానికి క్లోరిన్ బిళ్లలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటివరకు జలమండలి 5 లక్షల క్లోరిన్ బిళ్లలను పంపిణీ చేసిందని ఆయన పేరొన్నారు. మరో 5 లక్షల క్లోరిన్ బిళ్లలను పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.
నీరు నిలిచే ప్రాంతాలలో ప్రత్యేక బృందాలు
వర్షాల నేపథ్యంలో నిరంతరం అందుబాటులో ఉండేలా మొత్తం 16 మాన్సూన్ సేఫ్టీ టీమ్లను జలమండలి ఏర్పాటు చేసినట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. ఒకో టీమ్ లో ఐదుగురు సభ్యులు ఉంటారని, ఈ టీమ్కు ప్రత్యేక వాహనాలు 24 గంటలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎకడైనా నీరు నిలిస్తే వెంటనే వెళ్లి నీటిని తొలగించేందుకు ఈ వాహనాల్లో జనరేటర్తో కూడిన డీవాటర్ మోటర్ ఉంటుందని ఎండీ దానకిశోర్ తెలిపారు. వీటితో పాటు మరో 16 మినీ ఎయిర్ టెక్ వాహనాలను కూడా 24 గంటలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.