మేడ్చల్ / మేడ్చల్ కలెక్టరేట్/ ఘట్కేసర్ రూరల్ / శామీర్పేట / జవహర్నగర్ జూన్ 21: మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ యోగాసనాలను ఆచరించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతల్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యోగా శిక్షకులు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఒక్కటే మార్గమన్నారు. ఈ సందర్భంగా యోగసనాలు, ఆచరణతో కలిగే ప్రయోజనాన్ని వివరించారు. మేడ్చల్ పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఎంపీపీ రజితారాజమల్లాడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానందారెడ్డి, ఎంపీడీవో పద్మావతి, తహసీల్దార్ సరిత,మాజీ జడ్పీటీసీ శైలజాహరినాథ్ పాల్గొన్నారు. గుండ్లపోచంపల్లి మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
గుండ్లపోచంపల్లి కండ్లకోయలోని సీఎంఆర్సెట్లో నిర్వహించిన యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ వైస్ ప్రెసిడెంట్ ఉదయ్శంకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా గౌరవ అతిథిగా సాఫ్ట్వేర్ ఇంజినీరు అనురాగ్ హాజరయ్యారు. ప్రిన్సిపాల్ డాక్టర్ వీఏ నారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి నాగరాజు నాయక్ పాల్గొన్నారు. సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో నిర్వహించిన యోగా శిక్షకుడు రాజు యోగసనాలు చేయించారు. కార్యక్రమంలో సీఎంఆర్ కార్యదర్శి గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ రాజిరెడ్డి, సీఈవో అభినవ్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగాం అధికారి దుర్గా ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాలలో యోగాచార్యుడు గోపినాథ్ విద్యకు, యోగకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి టీవీ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీలత, డైరెక్టర్ సరోజారెడ్డి, డైరెక్టర్ అనురాగ్రెడ్డి, పీఆర్వో సుధాకర్, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ రాజేశ్ పాల్గొన్నారు.
మేడ్చల్ పట్టణంలోని న్యూ లిటిల్ లిల్లీ హైస్కూల్లో కరస్పాండెంట్ మంజులాప్రకాశ్ ఆధ్వర్యంలో యోగా శిక్షకుడు ఆంజనేయులు విద్యార్థులకు యోగా ప్రాధాన్యతను వివరించారు. నాగారం మున్సిపాలిటీలోని అంగన్వాడీ కేం ద్రంలో పిల్లలతో కలిసి చైర్మన్ చంద్రారెడ్డి యోగా చేశారు. ఘట్కేసర్ మండల పరిధి వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్శిటీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యోగా చేశారు. చౌదరిగూడలోని నల్ల నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలోఉపాధ్యాయులు, విద్యార్థినీవిద్యార్థులు యో గా చేశారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ సీవీ.కృష్ణారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. శామీర్పేటలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగద్గిరిగుట్టలో రామచంద్రమిషన్ హార్ట్ ఫుల్నెస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రాణాయామం, యోగాభ్యాసంపై అవగాహన కల్పించారు. కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇష్రత్, రామచంద్ర మిష న్ హార్ట్ఫుల్ నెస్ ఎంఎస్ఎన్ రెడ్డి, గోపాలకృష్ణన్, ప్రసాద్, లక్ష్మీ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జవహర్నగర్లో రణ్వీర్ తైక్వాండో అకాడమీలో మాస్టర్ రమేశ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.