Hyderabad | హైదరాబాద్ : మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో విషాదం నెలకొంది. ఓ ప్రయివేటు కాలేజీ విద్యార్థి శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న గంటా కనకరాజు(17) ఉరేసుకున్నాడు. గమనించిన కాలేజీ యాజమాన్యం, సిబ్బంది కలిసి.. మాదాపూర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కనకరాజు చదువులో ముందుండే వాడని తోటి విద్యార్థులు పేర్కొన్నారు. మృతుడి స్వస్థలం ములుగు జిల్లా.