సిటీబ్యూరో, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ) ;జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం 77వ స్వాతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి, కమిషనర్ రోనాల్డ్ రోస్లతో కలిసి మేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకు ముందు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్రెడ్డితో కలిసి మేయర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.
ఎస్సీఎల్టీలో వేడుకలు…
హైదరాబాద్ బండ్లగూడలోని కార్పొరేట్ భవన్లో స్వాతంత్య్ర దినోత్సవం సంబురంగా జరిగింది. ఎస్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) సభ్యులు డాక్టర్ ఎన్వీ రామకృష్ణ బదరీనాథ్ (న్యాయ విభాగం), చరణ్ సింగ్(టెక్నికల్), రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ పర్వీందర్ సింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎమ్.హర్షవర్ధన్రెడ్డి పాల్గొన్నారు.
టీఎస్పీఎస్సీలో…
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో స్వాంతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, కమిషన్ సభ్యులు లింగారెడ్డి, సుమిత్రా ఆనంద్, అరుణ కుమారి, అసిస్టెంట్ సెక్రటరీ మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.
లోకాయుక్తాలో ఘనంగా జెండావందనం
బషీర్బాగ్లోని లోకాయుక్తా కార్యాలయంలో జస్టిస్ సీవీ రాములు జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం, భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన మహానుభావులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప-లోక్యుక్తా వి.నిరంజన్ రావు, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయం ఆవరణలో జెండాను ఎగురవేస్తున్న హెచ్జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, ఉద్యోగులు
సాహిత్య అకాడమీలో జెండా ఆవిష్కరణ
తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్. సాయి అకాడమీ కార్యదర్శి బాలాచారి తదితరులు..