సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతుండడంతో వాతావరణం కొంత చల్లబడింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 37.8 డిగ్రీలు, కనిష్ఠం 25.6 డిగ్రీలు, గాలిలో తేమ 31 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.