నిర్మాణంలో మూడోస్థానం.. సెర్చింగ్లో రెండోస్థానం
ఐటీ కారిడార్లో 52 శాతం నిర్మాణాలు
మూడు నెలల్లో పెరిగిన వృద్ధిరేటు
ఆరు ప్రధాన నగరాల్లో 80వేల ఇండ్లు
1బీహెచ్కే ఫ్లాట్లకు అధిక డిమాండ్
స్వేర్ యార్డ్స్ త్రైమాసిక నివేదికలో వెల్లడి
సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో నూతన గృహ నిర్మాణాలు ఊపందుకున్నాయి. మూడు నెలల్లో 43శాతం వృద్ధి రేటు నమోదైందని స్వేర్ యార్డ్స్ త్రైమాసిక నివేదికలో వెల్లడించింది. అన్ని నగరాల్లో కలిపి 80వేల గృహ నిర్మాణాలు చేపట్టగా.. అత్యధికంగా ముంబైలో 35శాతం, పుణెలో 25 శాతం, హైదరాబాద్లో 22శాతంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఆన్లైన్ సెర్చింగ్లో ముంబై 35శాతం, హైదరాబాద్ 25 శాతం, పుణె 17శాతం, బెంగళూరు 16శాతం, గురుగ్రామ్ 5 శాతం, నోయిడా 2 శాతంగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్లో నూతన ఇండ్లకు డిమాండ్ పెరుగుతున్నదని నివేదికలో పేర్కొన్నారు.
వెస్ట్ హైదరాబాద్లోనే 52శాతం..
హైదరాబాద్లో ఐటీ కారిడార్ ఉన్న పడమర దిక్కునే ఎక్కువగా ఇండ్ల నిర్మాణాలు (52శాతం) చేపట్టారు. నార్త్ హైదరాబాద్లో 29శాతం, సౌత్లో 7శాతం, ఈస్ట్ 8శాతం, సెంట్రల్ హైదరాబాద్లో 4 శాతం మాత్రమే కొత్త నిర్మాణాలు చేపట్టినట్లు స్వేర్ యార్డ్స్ త్రైమాసిక నివేదికలో వెల్లడించింది. అదేవిధంగా ఇండ్ల కొనుగోలు చేయాలని ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్లో ఎక్కువగా అత్తాపూర్, కొంపల్లిలో అపార్టుమెంట్లలో 3బీహెచ్కే ఫ్లాట్ కోసం, బోడుప్పల్, ఈసీఐఎల్ వంటి ప్రాంతాల్లో వ్యక్తిగత గృహాల కోసం, కీసర, మేడ్చల్ ప్రాంతంలో మాత్రం ఓపెన్ ప్లాట్ల కోసం వెతికారని నివేదికలో పేర్కొన్నారు. 2021-2022లో హైదరాబాద్లో 20వేలకు పైగా నివాస గృహాలు ప్రారంభమైనట్లు వెల్లడించారు.
2022 త్రైమాసికంలో..