శంషాబాద్ విమానాశ్రయం నుంచి దిల్లీ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం చివరి నిమిషంలో రద్దయ్యింది. విమానం టేకాఫ్ అవ్వడానికి కొద్ది నిమిషాల ముందు సిబ్బంది సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో ఉన్నఫళంగా విమానాన్ని రద్దు చేశారు. ఫ్లైట్ ఎక్కిన 240 మంది ప్రయాణికులను సిబ్బంది దించేశారు. ఇలా చివరి నిమిషంలో విమానాన్ని రద్దు చేస్తే తమ పరిస్థితేంటి? అని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.