సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే కిందకు పడిపోతున్నాయి. దీంతో నగరవాసులను చలి వణికిస్తున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12.2 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.6 డిగ్రీలు, గాలిలో తేమ 30శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా రాగల మరో మూడు నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి, చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు హెచ్చరించారు.