వెయ్యికి బదులు రూ.10 చెల్లిస్తే పెట్టీ కేసు క్లోజ్
నగరంలో 3 లక్షలు పెండింగ్
నేటి నుంచి 8వ తేదీ వరకు అవకాశం
సిటీబ్యూరో, మే 1(నమస్తే తెలంగాణ) : లాక్డౌన్ సమయంలో నమోదు చేసిన కేసుల పెండెన్సీని క్లియర్ చేసేందుకు కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు నగర పోలీసులు. 2020-21 లాక్డౌన్ టైంలో వివిధ ఉల్లంఘనలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద పలు సెక్షన్లతో పెట్టీ కేసులు నమోదు చేశారు. రూ. 1000 వరకు జరిమానాలు విధించారు. ఆ సమయంలో నమోదైన దాదాపు 3 లక్షల కేసులు పెండింగ్లో ఉండగా, వాటిని పరిష్కరించుకునేందుకు పోలీసులు భారీ డిస్కౌంట్ను కల్పించా రు.
ఉల్లంఘనలపై నమోదైన ఒక్కో సెక్షన్కు కేవలం పది రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. ఈ అవకాశం 2 నుంచి 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని, ఉల్లంఘనదారులు సద్వినియోగం చేసుకోవాలని నగర అదనపు పోలీస్ కమిషనర్(క్రైమ్స్) ఏఆర్ శ్రీనివాస్ సూచించారు.