హైదరాబాద్ : నగర ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు శుభవార్త వినిపించారు. రేపట్నుంచి ఉదయం 6 గంటలకే తొలి మెట్రో రైలు ప్రారంభం కానుంది. రాత్రి 10:15 గంటలకు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైలు బయల్దేరనుంది. చివరి రైలు గమ్యస్థానానికి 11:15 గంటలకు చేరుకోనుంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనతో మెట్రో సేవలను అధికారులు పొడిగించారు. ఉదయం 7 గంటల నుంచి కాకుండా, 6 గంటలకే మెట్రో రైలు సేవలను అందుబాటులోకి తేవాలని ఓ ప్రయాణికుడు.. కేటీఆర్కు ట్విటర్లో విజ్ఞప్తి చేశాడు. దీంతో ప్రయాణికుల విజ్ఞప్తిని మెట్రో ఎండీ దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారు.