హైదరాబాద్: హైదరాబాద్లో మెట్రోరైలు సేవలు ప్రారంభమయ్యాయి. నాంపల్లి మెట్రోస్టేషన్లో ట్రాక్పై రైలు నిలిచిపిపోయింది. సాంకేతిక కారణాలతో ట్రాక్పై ఆగిపోయింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ కారిడార్లో నాంపల్లి స్టేషన్లో రైలు ఆగిపోవడంతో అన్ని సర్వీసులపై ప్రభావం పడింది. గంటసేపు మెట్రో సేవలు నిలిచిపోయాయి.
విషయం తెలుసుకున్న మెట్రో, ఎల్అండ్టీ అధికారులు స్పందించారు. వెంటనే మరమ్మతులు చేపట్టారు. అనంతరం మెట్రో సేవలను పునరుద్దరించారు. ఇటీవల తరుచూ మెట్రోసేవలు నిలిచిపోతున్నాయి. ఈ నెల 24న రెడ్లైన్ రూట్లో మెట్రోసేవలకు విఘాతం కలిగింది. సాంకేతిక లోపంతో రైలు మూసరాంబాగ్ స్టేషన్లో నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎల్బీనగర్ మియాపూర్ మధ్య రాకపోకలు కొద్దిసేపు స్తంభించిపోయాయి.