Hyderabad Metro | భారత స్వాతంత్ర్య దినోత్సవం వేళ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ ఫ్రీడం ఆఫర్ పేరుతో కొత్త పాస్ను మెట్రో ప్రయాణికులకు పరిచయం చేసింది. కేవలం రూ. 59 చెల్లించి.. ఈ నెల 12, 13, 15 తేదీల్లో నగరంలో ఎన్నిసార్లు అయినా ప్రయాణించొచ్చు అని హైదరాబాద్ మెట్రో వెల్లడించింది. ఈ అవకాశాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సూపర్ సేవర్ ఫ్రీడం ఆఫర్ ప్రకటించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఆఫర్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, మెట్రోను ఆదరించాలని ఆయన కోరారు.