Hyderabad Metro | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల ఛార్జీలను సవరించారు. మెట్రో రైలు కనీస ఛార్జీ రూ. 11, గరిష్ఠ ఛార్జీ రూ. 69కి సవరించారు. సవరించిన మెట్రో ఛార్జీలు ఈ నెల 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. మెట్రో ఛార్జీలు తగ్గించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పెంచిన ధరల్లో 10 శాతం రాయితీ కల్పిస్తూ ఎల్ అండ్ టీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
సవరించిన హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు
మొదటి 2 కి.మీ. వరకు రూ. 11
2 నుంచి 4 కి.మీ. వరకు రూ. 17
4 నుంచి 6 కి.మీ. వరకు రూ. 28
6 నుంచి 9 కి.మీ. వరకు రూ. 37
9 నుంచి 12 కి.మీ. వరకు రూ. 47
12 నుంచి 15 కి.మీ. వరకు రూ. 51
15 నుంచి 18 కి.మీ. వరకు రూ. 56
18 నుంచి 21 కి.మీ. వరకు రూ. 61
21 నుంచి 24 కి.మీ. వరకు రూ. 65
24 కి.మీ. నుంచి ఆపై దూరానికి రూ. 69