సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే అధికంగా నమోదవుతున్నాయి.
ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.9 డిగ్రీలు, గాలిలో తేమ 44 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించారు.