సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
కాగా, ద్రోణి కారణంగా నగరంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.7 డిగ్రీలు, గాలిలో తేమ 67 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.