మేడ్చల్;, శామీర్పేట, కీసర, జవహర్నగర్, ఘట్కేసర్ బోడుప్పల్, నవంబర్ 23: మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు వారి కుటుంబసభ్యుల ఇండ్లపై ఐటీ దాడులను నిరసిస్తూ బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా పలు చోట్ల మోదీ, అమిత్షాల దిష్టిబొమ్మలను దహనం చేశా రు. రోడ్డుపై బైఠాయించి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతో బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందన్నారు. బోయినిపల్లిలోని మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద జరిగిన నిరసనలో వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్ మహేశ్, హరికృష్ణ యాదవ్, నాయకులు శ్రీనివాస్ రాజు, నాగరాజు పాల్గొన్నారు. అనంతరం అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్ రెడ్డి పరామర్శించారు. జవహర్నగర్ కార్పొరేషన్లో ప్రధాన రోడ్డుపై టీఆర్ఎస్ నాయకులు బైఠాయించి మోదీ డౌన్… డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఘట్కేసర్లో పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో, పోచారంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, చైర్మన్ కొండల్రెడ్డి ఆధ్వర్యంలో మోదీ, అమిత్షాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బోడుప్పల్లోని హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని పార్టీ శ్రేణులు దిగ్భందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లక్ష్మీరవిగౌడ్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు,నాయకులుకృష్ణ, జంగారెడ్డి, చక్రపాణిగౌడ్ పాల్గొన్నారు. కీసర ప్రధాన చౌరస్తా లో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, ఆయా గ్రామాల సర్పంచ్ మాధురి వెంకటేశ్, పెంటయ్య, విమలనాగరాజు,బీఆర్ఎస్ నాయకపు వెంకటేశ్, మల్లారెడ్డి, ఎం.డీ. ఆరీఫ్, ఎం.జంగయ్యయాదవ్ పాల్గొన్నారు. ఉమ్మడి శామీర్పేట మండల టీఆర్ఎస్ శ్రేణులు అలియాబాద్ చౌరస్తాలో రాజీవ్ రహదారిపై భైఠాయించి రాస్తారోకో చేసి మోదీ దిష్టిబొమ్మను దహ నం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.జహంగీర్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఎంపీపీ ఎల్లూభాయిబాబు, జడ్పీ కో ఆఫ్షన్ జహీరుద్దిన్, వైస్ ఎంపీపీ సుజాత, మండలాల అధ్యక్షులు సుదర్శన్, మల్లేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శులు సతీశ్రెడ్డి, అనిల్రెడ్డి, యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సర్పంచ్లు మోహన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, జామ్ రవి, కృపాకర్రెడ్డి, ఆంజనేయులు, ఎంపీటీసీ నాగరాజు, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ పెంటారెడ్డి, మాజీ కో ఆఫ్షన్ సభ్యుడు చాంద్పాషా, నర్సింహారెడ్డి, పవన్ముదిరాజ్ పాల్గొన్నారు.