అమీర్పేట్, డిసెంబర్ 17 : ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు హైదరాబాద్ను మెడికల్ హబ్గా మార్చాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. దేశంలో 24వ, రాష్ట్రంలో 9వ మెడికవర్ ఆసుపత్రిని అమీర్పేట్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్శిస్తోందని అన్నారు. కరోనా సమయంలో మూడు వ్యాక్సిన్లు వస్తే అందులో రెండు హైదరాబాద్ నుంచి వచ్చినవేనని గుర్తు చేశారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని పరిశీలిస్తే ప్రతి జిల్లాలో కూడా వైద్య కళాశాలలను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
మెడికవర్ ఆసుపత్రి దేశ విదేశాల నుంచి వస్తుండే వారికి చక్కటి వైద్యం అందించాలని, అదే విధంగా రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద మంచి వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. బేగంపేట్లో మెడికవర్ ఆసుపత్రి 200 పడకలతో నిర్మించడం శుభపరిణామమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో వెంకటి, మెడికవర్ ఈడీ హరికృష్ణ, సీబీవో మహేశ్ దెగ్లూకర్, క్లస్టర్ హెడ్ మేఘ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, వైద్యులు పాల్గొన్నారు.