మన్సూరాబాద్, సెప్టెంబర్ 8 : అతివేగంతో వచ్చిన ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న ఓ మహిళను డీకొట్టింది. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. సీఐ అశోక్రెడ్డి కథనం ప్రకారం.. మీర్పేట్కు చెందిన అంజన బాలమ్మ (50) వృత్తిరీత్య కూలీ పని చేస్తుంది.
ప్రతి రోజు మాదిరిగా కూలీ పని కోసం బాలమ్మ ఎల్బీనగర్లోని లేబర్ అడ్డాకు బయలుదేరింది. బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో లేబర్ అడ్డాకు చేరుకునేందుకు ఎల్బీనగర్ రింగ్రోడ్డులోని శారద వైన్స్ ముందు నుంచి రోడ్డు దాటుతుంది. ఇదే సమయంలో సాగర్ రింగ్రోడ్డు నుంచి ఎల్బీనగర్ వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ28జడ్ 0145) వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న బాలమ్మను ఢీకొట్టింది.
ఈ ఘటనలో బాలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతురాలి కోడలు జయసుధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.