బడంగ్పేట, సెప్టెంబర్ 1: ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు, విదేశీ డాలర్స్ అపహరించిన సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం.. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శరీఫ్నగర్లో నివాసముంటున్న మహ్మద్అలీ బుధవారం రాత్రి ఇంటికి తాళం వేసి సైదాబాద్లో ఉన్న బంధువుల శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. రాత్రి పొద్దుపోయాక తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి.
ఇంట్లోకి వెళ్లి చూడగా.. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సీఐ మహేందర్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. డాగ్ స్వాడ్, క్లూస్ టీమ్తో తనిఖీ చేయించారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సంఘటనలో 43 తులాల బంగారం, 25 తులాల వెండి, రూ.15వేలు, 80 యూఎస్ఏ డాలర్స్, 12బ్రిస్ట్ వాచ్లు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.