Ration shops | ప్రభుత్వం ఏప్రిల్ నెలలో మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించిందని తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం సరిపడా రేషన్ సరఫరా చేయడంలో విఫలమవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చాలా ప్రాంతాల్లో రేషన్ షాపుల్లో బియ్యం అందుబాటులో లేవని షాపులను మూసివేశారు. తెరిచి ఉన్న షాపులకు వెళ్లి వినియోగదారులు ఆరా తీయగా.. డీలర్లు స్టాకు రావడం లేదని సమాధానం ఇచ్చి తిప్పి పంపిస్తున్నారు. చాలా చోట్ల భారీ క్యూలైన్ లో గంటల తరబడి రేషన్ బియ్యం తీసుకోవడానికి క్యూలో నిలబడ్డారు. బయోమెట్రిక్ సర్వర్ సరిగ్గా రావడం లేదని.. అందువల్ల చాలా సమయం పడుతుందని రేషన్ షాప్ వద్ద ఉన్న వినియోగదారులు తెలియజేశారు.
సికింద్రాబాద్, వారాసిగూడ సీతాఫల్ మండి, ఇందిరానగర్, కంటోన్మెంట్, రసూల్ పుర పోలీస్ లైన్, గన్ బజార్ తదితర ప్రాంతాలలో రేషన్ షాపుల వద్ద ఈ పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్లోని పలు రేషన్ షాపుల వద్ద పరిస్థితి ఇలా..





Reservoirs | తెలంగాణలో తీవ్ర నీటి సంక్షోభం.. డెడ్ స్టోరేజ్ దిశగా తెలంగాణ జలాశయాలు
Anant Ambani | ఆధ్యాత్మిక సేవలో అంబానీ వారసుడు.. గురువాయూర్, రాజరాజేశ్వరం ఆలయాలకు రూ.18 కోట్ల సాయం!
New Shayampet | కాలుష్య కోరల్లో చెరవులు..పట్టించుకోని అధికారులు