హైదరాబాద్ : రాఖీ పండుగ, ఆదివారం సెలవు దినం కావడంతో మెట్రోరైళ్లలో ఇవాళ ప్రయాణికుల రద్దీ కనిపించింది. ఉదయం నుంచి రాత్రివరకు మెట్రో బోగీల్లో ప్రయాణికులు కిక్కిరిశారు. నగరంలోని మెట్రో మూడు లైన్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. చాలారోజుల తరువాత ఒక్కరోజే దాదాపు 3 లక్షల మంది మెట్రోరైళ్లలో ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ తర్వాత ఇవాళే అత్యధిక మంది ప్రయాణించినట్లు మెట్రో సిబ్బంది సైతం అంటున్నారు. ఇవాళ పలు మార్గాల్లో ఆర్టీసీ బస్సుల్లోనూ తీవ్ర రద్దీ కనిపించింది. సెలవు దినమైనా నగరంలోని చాలా మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ నెలకొంది.