మారేడ్పల్లి, ఏప్రిల్ 24: తనను గెలిపిస్తే..కంటోన్మెంట్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత అన్నారు.
బుధవారం ఐదో వార్డులో ఇంటింటికీ తిరుగుతూ…బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన చెల్లిని, తండ్రిని ఏ విధంగా ఆశీర్వదించి.. అసెంబ్లీకి పంపించారో..తనను కూడా అదే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.