హైదరాబాద్ : కరోనా మహమ్మారికి మరో హోం గార్డు బలయ్యాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సుధాకర్ రెడ్డి (43) గాంధీ దవాఖానలో కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్దిపేటకు చెందిన సుధాకర్ రెడ్డి నగర పరిధిలోని దమ్మాయిగూడెంలో నివాసం ఉంటున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 2018 నుంచి ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతి చెందిన సమాచారంతో ఇన్స్పెక్టర్ సైదులుతో పాటు ఇతర సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
పోలీసు స్టేషన్ సిబ్బంది సమీకరించిన రూ.1.5 లక్షలను సుధాకర్ రెడ్డి భార్యకు అందజేశారు. సుధాకర్ రెడ్డి తన డ్యూటీని ప్రాణం కంటే మిన్నగా భావించే వాడని తోటి సిబ్బంది కొనియాడారు. ప్రజా రక్షణ కోసం తమ ప్రణాల్ని పణంగా పెట్టి ఉద్యోగ నిర్వహణ చేసే పోలీసుల త్యాగం విలువైనదని ఇన్స్పెక్టర్ సైదులు అన్నారు.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్