సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్లో హోర్డింగ్లు భయపెడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విచ్చలవిడిగా గ్రేటర్ వ్యాప్తంగా అనుమతి లేని హోర్డింగ్లు కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ప్రైవేట్ యాడ్ ఏజెన్సీలు అక్రమ దందాకు తెరలేపారు. ప్రకటనల పాలసీ తీసుకువచ్చామని చెబుతున్న సర్కారు..క్షేత్రస్థాయిలో ఎక్కడ అమలు కావడం లేదు.దీని ఫలితంగానే ఎల్లప్పుడూ వాహనాల రద్దీతో ఉండే బంజారాహిల్స్ తాజ్కృష్ణ మార్గంలో హోర్డింగ్ వాహనదారులకు భయపెడుతున్నది.
బంజారాహిల్స్ పరిధిలోని తాజ్ డెకన్ – తాజ్ కృష్ణ హోటళ్ల మధ్య ఉన్న బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన ఒక భారీ హోర్డింగ్ ఫ్లెక్సీ ప్రమాదకరంగా మారింది. గడిచిన కొన్ని రోజులుగా వీస్తున్న బలమైన గాలుల ధాటికి ఈ భారీ ఫ్లెక్సీ పూర్తిగా చినిగిపోయింది. చిరిగిన ఫ్లెక్సీ ముకలు రోడ్డుపైకి ప్రమాదకరంగా వేలాడుతుండటంతో, ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల ముఖాలకు, తలలకు తాకుతున్నాయి. దీంతో వాహనాల నియంత్రణ కోల్పోయి కిందపడిపోయే ప్రమాదం పొంచి ఉంది.
ఈ వంతెన కింద ఎల్లప్పుడూ వాహనాల రద్దీ ఎకువగా ఉంటుంది. ఎప్పుడు ఏ క్షణంలో ఆ భారీ ఫ్లెక్సీ ఊడి కిందపడుతుందో, ఎవరి ప్రాణాలు తీస్తుందోనని స్థానికులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి ఈ వేలాడుతున్న ఫ్లెక్సీలు సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాద తీవ్రత మరింత ఎకువగా ఉండే అవకాశం ఉంది. వేగంగా వెళ్లేటప్పుడు ఆ ఫ్లెక్సీ ముకలు ఒకసారిగా బైక్లకు చుట్టుకుంటే ప్రాణాలకే ప్రమాదం ఉందని, అధికారులు వెంటనే స్పందించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ సరిల్ అధికారులు, విజిలెన్స్ విభాగానికి సమాచారం అందించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించక ముందే, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆ ప్రమాదకర ఫ్లెక్సీని తొలగించాలని, నిబంధనలు ఉల్లంఘించిన హోర్డింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.