స్థానికులకు బస్తీల్లోనే మెరుగైన వైద్య సేవలు
మారేడ్పల్లి, ఏప్రిల్ 3: జ్వరం వచ్చినా..జలుబు, దగ్గు లాంటి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా..చలో మా బస్తీ దవాఖానకు అంటూ భరోసాతో వెళ్లి వైద్య చికిత్సలను పొందుతున్నారు. ఇంటి ముంగిటే వైద్య సేవలు అందుబాటులో ఉండడంతో…ఒంటికి సుస్త్తీ అయితే చాలు బస్తీ దవాఖానకు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు. మోండా డివిజన్ పరిధిలో రైల్నిలయం అంబేద్కర్నగర్, చాపల బావి, నాలా బజార్ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం 3 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. నిత్యం ఈ బస్తీ దవాఖానలకు వైద్య సేవల నిమిత్తం 70 నుంచి 80 మంది వరకు రోగులు వస్తుంటారు. ఈ బస్తీ దవాఖానల్లో వైద్యులతో పాటు స్టాఫ్ నర్సులు,మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎంలు , ల్యాబ్ టెక్నీషన్లు వైద్య సేవలు అందిస్తున్నారు.
మూడేండ్ల నుంచి వైద్య సేవలు
అంబేద్కర్నగర్ బస్తీలో మూడేండ్లుగా బస్తీ దవాఖానాకు వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలను అందిస్తూ..ప్రజలకు మరింత భరోసాను కల్పిస్తున్నాము. ఈ బస్తీ దవాఖానల్లో నిత్యం షుగర్, బీపీ వైద్య పరీక్షల తో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలను చేస్తున్నాము. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు నిత్యం ఇక్కడ వైద్య సేవలు అండుకుంటున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్లు బస్తీల్లో ఇంటింటికీ వెళ్లి, ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని, వివరాలను నమోదు చేసుకుం టున్నారు. – మంజుల, బస్తీ దవాఖాన వైద్యురాలు, అంబేద్కర్నగర్