సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ స్టేడియంలో సెప్టెంబర్ 25న భారత్, ఆస్ట్రేలియాల మధ్య టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగనున్నది.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్భగవత్ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్ కలిసి క్రికెట్ మ్యాచ్కు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలకు ఇటీవల ప్రెసిడెంట్ మెడల్ను పొందిన సీపీ మహేశ్భగవత్ను హెచ్సీఏ ప్రతినిధులు సన్మానించారు.