సిటీబ్యూరో, మే 25(నమస్తే తెలంగాణ): తెలంగాణ కోసం జరిగిన పోరాటం లో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎం తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్మారక కేం ద్రాన్ని ప్రభుత్వం హెచ్ఎండీఏ అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ హెచ్ఎండీఏకు ప్రత్యేకంగా లేఖ రాసింది. హుస్సేన్సాగర్ సమీపంలో రాష్ట్ర సచివాలయం ఎదురుగా జలదృశ్యం ఉన్న స్థలంలో సుమారు రూ.177 కోట్లతో తెలంగాణ అమరవీరుల స్మారకం కేంద్రాన్ని అత్యాధునిక నిర్మాణ శైలిలో నిర్మించింది.
నిర్మాణ పనులన్నీ కేసీఆర్ ప్రభుత్వం హ యాంలోనే పూర్తయి ప్రారంభోత్సవం చేసుకున్న అమరవీరుల స్మారకం కేంద్రాన్ని హెచ్ఎండీఏకు అప్పగించడం ద్వారా పర్యాటకులకు మరింత అందుబాటులో ఉండే లా చేయనున్నారు. సంయుక్తంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని, పెండింగ్లో ఉన్న పనులను, నిర్వహణ అంశాలపై ఇంజనీరింగ్ అధికారుల బృందం పరిశీలించిన తర్వాత అప్పగింతలకు సంబంధించిన తుది నిర్ణయం జరుగుతుందని హెచ్ఎండీఏ అధికారి ఒక రు తెలిపారు.
ఇప్పటికే హుస్సేన్సాగర్ చు ట్టూ అన్ని రకాల పర్యాటక కేంద్రాలు, పా ర్కుల నిర్వహణను హెచ్ఎండీఏ పరిధిలో ని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ చూస్తోం ది. లుంబినీ పార్కును ఆనుకొనే అమరవీరుల స్మారకం కేంద్రం ఉండటంతో నిర్వహణతో పాటు పర్యాటక కేంద్రంగా నిత్యం వేలాది మందికి అందుబాటులోకి ఉంచేందుకు హెచ్ఎండీఏ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.