మియాపూర్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Krishna Rao) అన్నారు. హైదర్నగర్లో కొనసాగుతున్న బాలానగర్ మండల మైనార్టీ గురుకుల పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 2024-25 విద్యాసంవత్సరానికి గాను పాఠశాలలో ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాలను(Pamplets) ఎమ్మెల్యే విడుదల చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ దూలపల్లిలో మైనార్టీ గురుకుల పాఠశాలకు పక్కా భవన నిర్మాణం కోసం రెండున్నర ఎకరాలను కేటాయించినట్లు పేర్కొన్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య(Quality education) లభిస్తుందని పేర్కొన్నారు. 5 ,6,7,8 తరగతులలో ప్రవేశాల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చదువ(Education), క్రీడలలో(Sports) ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు ఆయన బహుమతులను,నోటు పుస్తకాలను అందజేశారు.
ఇటీవల అండమాన్లో నిర్వహించిన కూచిపూడి నృత్య(Kuchipudi Dance) ప్రదర్శనలో ప్రతిభ కనబరచిన ఆల్విన్ కాలనీ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్కు చెందిన వరలక్ష్మీ కుమార్తె ప్రదీక్షను కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్తో కలిసి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభినందించారు. కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్ చిన్నారి ప్రదీక్షకు రూ. 10 వేల నగదు ప్రోత్సాహకాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.