సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పదిరోజులపాటు లాక్డౌన్ విధించాలని బుధవారం నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 7 నుంచి 16 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అధ్యక్షత బుధవారం అత్యవసర కేబినేట్ సమావేశం జరిగింది.
సమావేశంలో ఈ మేరకు మంత్రివర్గం లాక్డౌన్ అమలుకు ఆమోదముద్ర వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం పదోతరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ఇంటర్కు ప్రమోట్ చేసింది.
బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణించాలనుకునే వారు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకొని నెగిటివ్ రిపోర్టు వెంట ఉంచుకోవాలని సూచించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.