కాంపౌండ్వాల్ లేకుండా దర్శనమిస్తున్న ముస్లిం గ్రేవ్యార్డు
అసంపూర్తిగా నిర్మించిన రూంలు
కుత్బుల్లాపూర్, మార్చి 31 : కుత్బుల్లాపూర్ డివిజన్, పద్మానగర్ ఫేస్-2లో ముస్లింలు, హిందువులు, క్రిష్టియన్ల కోసం ఒకే దగ్గర మూడు గ్రేవ్యార్డుల నిర్మాణం కోసం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ రూ.1.50 కోట్ల నిధులు కేటాయించారు. దాదాపుగా ఏడాదిన్నర కిందట పనులు మొదలు పెట్టినా.. ఇప్పటి వరకు పూర్తికాలేదు.. ఈ మూడు గ్రేవ్యార్డుల్లో కాంపౌండ్ వాల్, ప్రధాన గేటు, పార్కింగ్ టైల్స్, కమాన్, కాం పౌండ్వాల్ చుట్టూ పార్కింగ్, రూంలు, ఓజ్ఖాన, కాల్చేదిమ్మెలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. కొన్ని అభివృ ద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇంకా పనులు పూర్తికాకపోవడంతో ముందుబాబులు, పోకిరీలకు అడ్డాలుగా మారాయి. ముస్లింల గ్రేవ్యార్డుకు రూ. 50 లక్షలు, హిందువుల గ్రేవ్యార్డుకు రూ.75 లక్షలు, క్రిష్టియన్ల గ్రేవ్యార్డుకు రూ.25 లక్షల నిధులు వెచ్చించారు. దీనిపై కుత్బుల్లాపూర్ ఇంజినీరింగ్ విభాగం ఈఈ క్రిష్ణచైతన్యను వివరణ కోరగా… సంబంధిత గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగా పనులు ఆగిపోయింది వాస్తవమేనని… సకాలంలో పనులు పూర్తి చేసి, అన్ని మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.