అత్తాపూర్, మార్చి 31: ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ‘మన ఊరు, మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ హైదర్గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన మన బస్తీ, మన బడి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 9.5లక్షలతో పాఠశాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు కనీస సౌకర్యాలను కల్పిస్తామన్నారు. మంజూరైన నిధులతో పాఠశాలలో కావాల్సిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పాఠశాల తరగతి గదులను పరీశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఆహారం, ఆటవస్తువులు ఇతర అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ సంగీత, ఎంఈవో రామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కుమార్గౌడ్, హెచ్ఎం సుహాసిని, నాయకులు సుభాశ్రెడ్డి, రామేశ్వర్రావు, కొమురయ్య, చిన్న, నరేందర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.