విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సర్కారు స్కూళ్లను అద్భుతంగా తీsర్చిదిద్దుతున్నది. ముఖ్యంగా ‘మన బస్తీ- మన బడి’తో ప్రైవేటుకు దీటుగా ఆధునిక హంగులు కల్పిస్తున్నది. హైదరాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమం కింద 239 స్కూళ్లు ఎంపికవ్వగా, వివిధ పనుల కోసం రూ.44 కోట్లు కేటాయించారు. దశల వారీగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్, తాగునీరు, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, ఫర్నిచర్ ఇలా ఏలోటూ లేకుండా వసతులు సమకూర్చుతున్నారు. ఇక మేడ్చల్ జిల్లాలో మొదటి దశలో 176 పాఠశాలలను ఎంపిక చేశారు. రూ. 70 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే 25 స్కూళ్లలో అభివృద్ధి పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమయ్యాయి.
సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మన బస్తీ-మనబడి పథకం కింద ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేటుకు దీటుగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ సంకల్పంతో సర్కారు బడులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ సారి 20 శాతం ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు అడ్మిషన్లు పొందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా బడులకు పెయింటింగ్, మరమ్మతులు, విద్యుద్దీకరణ పనులు చేస్తున్నారు. ఆధునిక హంగులతో పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పరిసరాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. పచ్చదనంతో పాటు పాత్వేలు నిర్మిస్తున్నారు.
జిల్లాలో 239 స్కూళ్లు ఎంపిక..
మన బస్తీ-మన బడి పథకం కింద జిల్లా వ్యాప్తంగా మొత్తం 239 సర్కారు బడులను ఎంపిక చేశారు. వాటిలో గత ఏడాదిలోనే దాదాపు 10 పాఠశాలల వరకు అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో మహబూబియా, ఆలియా వంటి ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు. మిగతా స్కూల్స్లో దశల వారీగా పునరాభివృద్ధి పనులు, మరమ్మతులు కొనసాగుతున్నాయి. అలాగే ఫిబ్రవరి 1న ప్రారంభించేందుకు ఆరు పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా విద్యాధికారి ఆర్ రోహిణి తెలిపారు. అలాగే మరో 32 స్కూళ్లను మన బస్తీ – మన బడి పథకం కింద ప్రారంభించనున్నారు. ఈ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.44 కోట్ల వరకు నిధులు కేటాయించింది. వాటిలో 156 స్కూళ్లు సొంత భవనాల్లో కొనసాగుతున్నాయని, మిగిలిన 80 స్కూల్స్ మాత్రం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న స్కూల్స్ను త్వరలోనే సొంత భవనాల్లోకి తరలించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు డీఈవో అభిప్రాయపడ్డారు.
వంద శాతం పనులు పూర్తయిన స్కూళ్ల వివరాలు..
బహదూర్పురా, మొఘల్పురా, మండి మీరాలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రూ.4,75,948 కేటాయించారు. ఈ నిధులను ఆ స్కూల్లో తాగునీటి సౌకర్యం కల్పించడానికి, విద్యుద్దీకరణ పనులు, పలు మరమ్మతుల కోసం ఖర్చు చేశారు.
బండ్లగూడ ప్రాథమిక పాఠశాల
బండ్లగూడలోని బేల చందులాల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రూ.5.67 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో పాఠశాలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. ఇందులో తరగతి గదులు, పిల్లలు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేశారు. ప్రహరీ గోడలు, తాగునీటి సౌకర్యం, విద్యుద్దీకరణ పనులు, మరమ్మతులకు కేటాయించిన నిధులను ఖర్చు చేశారు.
ముషీరాబాద్..
మైలార్గూడలోని ప్రభుత్వ పాఠశాలకు రూ.18,92,688 నిధులు విడుదల చేశారు. ఆ నిధులను ప్రహరీగోడ నిర్మాణం, విద్యుద్దీకరణ పనులు, విద్యార్థులు, ఫర్నీచర్, పలు మరమ్మతులకు ఖర్చు చేశారు.
తిరుమలగిరి, పికెట్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం రూ.36,28,274 నిధులు కేటాయించారు. ఈ నిధులను తాగునీటి అవసరాలు తీర్చడానికి, విద్యుద్దీకరణ పనులు, విద్యార్థులు, ఫర్నీచర్, కొన్ని మరమ్మతులు చేశారు.
రాజ్భవన్ స్కూల్..
ఖైరతాబాద్లోని రాజ్భవన్ స్కూల్కు మన బస్తీ-మన బడి పథకం కింద రూ.1.65 లక్షలు
కేటాయించారు. నిధులను మరుగుదొడ్ల అభివృద్ధికి ఖర్చు చేశారు. దీంతో విద్యార్థుల కోసం స్కూల్ను వంద శాతం అభివృద్ధి చేశారు.
తిరుమలగిరి.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, బొల్లారం..
ఈ స్కూల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.24,50,630 లు కేటాయించారు. ఈ నిధులను ప్రహరీ గోడల
నిర్మాణం, తాగునీటి సౌకర్యం, విద్యుద్దీకరణ పనులు, విద్యార్థులు, సిబ్బందికి కావాల్సిన ఫర్నీచర్, మేజర్, మైనర్మరమ్మతులకు వెచ్చించారు.
బహుదూర్పురా, ఫాతీమానగర్, వాటేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రూ.3,16,332 ప్రభుత్వం
కేటాయించింది. ఆ నిధులను తాగునీటి సౌకర్యం, విద్యుద్దీకరణ పనులు, మేజర్, మైనర్ రిపేర్లకు
వంద శాతం ఖర్చు చేశారు.