కార్మిక మంత్రి మల్లారెడ్డి
ఘట్కేసర్ రూరల్, జూన్ 25 : కార్పొరేట్కు దీటుగా విద్యనందించేందుకు ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం ప్రతాపసింగారం ప్రభుత్వ పాఠశాలలో ‘మనఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.25 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్రెడ్డిలతో కలిసి మంత్రి శనివారం భూమిపూజ చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, వీటిల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. అలాగే మాదారం, అంకుషాపూర్ గ్రామాల్లో పబ్లిక్ లైబ్రరీలను మంత్రి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు జలజ, యాదగిరి, శివశంకర్, ఇన్చార్జి సర్పంచ్ లింగేశ్వర్రావు, సహకార సంఘం డైరెక్టర్ ధర్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.