సిటీబ్యూరో, మే 29 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించడం, ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియజేసేందుకు ‘నమస్తే తెలంగాణ-నిపుణ-తెలంగాణ టుడే’ సంయుక్తాధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు జరగనుంది.
‘కొలువు-గెలువు’ పేరిట బాగ్లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది. వివరాలకు 9182777143, 9182777555 లను సంప్రదించొచ్చు.