రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సాధించిన తొమ్మిదేండ్ల ప్రగతిని దశ దిశలా విస్తరించేలా సంబురాలను నిర్వహిస్తోంది. జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకు వెళ్లేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమిస్తున్నారు. జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ల నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ ప్రగతిని ప్రజలకు వివరించనున్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను విద్యుదీపాలంకరణ చేసి పండుగ వాతావరణంలో దశాబ్ది వేడుకలు చేయనున్నారు.
– సిటీబ్యూరో, మే 30 (నమసే తెలంగాణ)
సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా సాధించిన విజయాలను ఇంటింటికీ తీసుకువెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రం ఆవిర్భవించి పదో ఏట అడుగిడుగుతున్న సందర్భంగా ప్రభుత్వం జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నది. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమిస్తున్నారు. జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ల నేతృత్వంలో ఉత్సవాలు నిర్వహించే ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని నియోజకవర్గాల వారీగా కార్యక్రమాల నిర్వహణపై ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆయా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమాలలో నిమగ్నం చేస్తున్నారు.
ఉత్సవాల్లో ముఖ్యమైనవి :