కొండాపూర్, ఫిబ్రవరి 6 : నిత్య వ్యాయామంతో ఆరోగ్యం చేకూరుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. సోమవారం మాదాపూర్లోని పత్రికనగర్ కాలనీ అసోసియేషన్, మెడికవర్ దవాఖాన సహకారంతో రూ. 5లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట పరికరాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి రోజూ వ్యాయామం చేస్తే శరీరానికి ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం చేకూరుతుందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పార్కులు, ఖాళీ స్థలాల్లో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. జిమ్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
అనంతరం పత్రికనగర్లోని పార్కులో కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటారు. పత్రికనగర్ పచ్చని చెట్లతో విరాజిల్లేలా అసోసియేషన్ బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ రమేశ్, టౌన్ప్లానింగ్ ఏసీపీ మెహ్రా, టీపీఎస్ విశాల్, ఏఎంఓహెచ్ నగేశ్నాయక్, స్ట్రీట్ లైట్స్ ఈఈ మల్లికార్జునరావు, ఏఈ రాజశేఖర్, యూబీడీ విభాగం అధికారి యూసఫ్, బీఆర్ఎస్ నాయకులు తిరుపతి, రాజు యాదవ్, కాలనీ వాసులు శ్రీనివాస్రావు, రామకోటయ్య, ఆంజనేయులు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఏసీ క్లబ్ హౌస్ ప్రారంభం..
మియాపూర్, ఫిబ్రవరి 6 : వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని వడ్దేపల్లి ఎన్క్లేవ్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించుకున్న ఏసీ క్లబ్ హౌస్ను విప్ గాంధీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేడుకలు సమావేశాలకు క్లబ్ హౌస్ వేదికలా ఉపయోగపడుతుందన్నారు. ఈ నిర్మాణం మిగిలిన కాలనీలకు ఆదర్శమని విప్ గాంధీ పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధికి తన పూర్తి తోడ్పాటును అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, పార్టీ నేతలు భాస్కర్రావు, ఎన్క్లేవ్ వాసులు భగవాన్, దశరథ్రెడ్డి, దేవేందర్, ఫణి, రాము, నాచారయ్య, వెంకటరావు, నర్సారావు, వెంకటరత్నంచారి, శంకరయ్య, ప్రసాద్, నరేంద్ర, చిన్నారులు పాల్గొన్నారు. వివేకానందనగర్ డివిజన్ పరిధిలో రూ.1.13 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నట్లు విప్ గాంధీ పేర్కొన్నారు.