శంషాబాద్ రూరల్, మార్చి 26: ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. శనివారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని మధురానగర్ కాలనీకి చెందిన పట్లోళ్ల సుదర్శన్రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చేయించుకున్నాడు. దీంతో అతడి ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నాడు. మంజూరైన రూ.2.50లక్షల చెక్కును ఎమ్మెల్యే తన నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ సుష్మ, వైస్ చైర్మన్ బండిగోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ శ్రావంతిశ్రీకాంత్రెడ్డి, వార్డు కమిటీ అధ్యక్షుడు పవన్గౌడ్, ఉపాధ్యాక్షుడు జైహింద్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సంహ గౌడ్, మహిళా నాయకురాలు సౌమ్య, హన్ముంతు, గోవర్ధన్, శివానంద్రెడ్డి, సుభాష్, గోపాల్రెడ్డి ఉన్నారు.
నీటి వృథాను అరికట్టాలి
అత్తాపూర్, మార్చి 26: నీటి వృథాను అరికట్టాలని అత్తాపూర్ కార్పొరేటర్ మోండ్ర సంగీతాగౌరిశంకర్ పేర్కొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జలమండలి, పుష్పగిరి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జల వారోత్సవాల్లో భాగంగా హైదర్గూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జలీల్ హుస్సేన్, డిప్యూటీ మేనేజర్ శ్రావ్యారెడ్డి, మేనేజర్ సుహాసిని, పాఠశాల ఉపాధ్యాయులు, పుష్పగిరి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పుష్పలీల, అధ్యక్షుడు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.