చాదర్ఘాట్ : నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ ( Minister Srinivas Goud ) అన్నారు. మంగళవారం మలక్పేటలోని మెరీడియన్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర యువజన సర్వీసుల విభాగం సహకారంతో నిర్వహించిన మెగా జాబ్మేళా (Jobmela) ను ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ఒకప్పుడు ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. నో వెకన్సీ బోర్డుతో నిరుద్యోగులు తిప్పలు పడేవారు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో జాబ్ మేళా ద్వారా ముంగిట వద్దకే వచ్చి ఉద్యోగాలు (Employment) ఇస్తున్నారని అన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ( Minister KTR ) కృషి తో ఎన్నో బహుళార్ధ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు.
గతంలో బ్రతకడానికి దుబాయ్ ( Dubai ), బొంబాయి ( Mumbai ) కి ఎంతో మంది పోయేది. బ్రతకాలంటే హైదరాబాద్ (Hyderabad) పోవాలి. తెలంగాణ వెళ్లాలి. అనే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కొనియాడారు. ఎమ్మెల్యే అహ్మద్ బలాల మాట్లాడుతూ జాబ్మేళాను నిరుద్యోగ యవత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మలక్పేటలోని విద్యార్థులు, యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం జాబ్మేళాను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
సుమారు 60 కంపెనీలల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆఫర్ లెటర్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎం.ఏ.సలం షాహీద్, మినాజద్దీన్, నాయకులు షేక్ మొహియుద్దీన్, సైఫుదీన్ షఫీ, అలీం తదితరులు పాల్గొన్నారు.