ఆర్కేపురం : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా సమయంలో కూడ ఆవా వర్కర్లు ఎంతో కృషి చేశారని చెప్పారు. శుక్రవారం సరూర్నగర్ తహసీల్దారు కార్యాలయంలో 26మంది లబ్ది దారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
అదే విధంగా ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 10లక్షల మందికి కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఆశ వర్కర్ల సేవలు మరువలేనివని చెప్పారు.స్మార్ట్ ఫోన్ల వల్ల ఫీవర్ సర్వే. కరోనా కట్టడికి ఎంతో ఉపయోగ పడుతాయని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంఆడ్ఎచ్ఓ స్వరాజ్య లక్ష్మీ, కందుకూరు ఆర్డీఓ వెంకటాచారి,తహసీల్దార్ రాంమోహన్,మా.ఈ కార్పోరేటర్ పారుపల్లి అనితా దయాకర్రెడ్డి, నాయకులు బేర బాలకిషన్, ఆకుల అరవింద్కుమార్, కొండల్రెడ్డి, మఠహందర్ యాదవ పెండ్యాల నగేష్, మురుకుంట అరవింద్లు పాల్గొన్నారు.