హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వేర్వేరు ప్రదేశాల్లో భారీ చోరీ జరిగింది. భవాని కాలనీలో ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 11 తులాల బంగారం, రూ. 75 వేల నగదును అపహరించారు.
జలాల్ బాబా నగర్లో కూడా ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న 2 తులాల బంగారం, రూ. 10 వేల నగదును దొంగలు అపహరించారు. ఈ చోరీ జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబ యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.