RGIA | రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఓ ఇద్దరు ప్రయాణికుల నుంచి 1.218 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 74 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఇద్దరిని అరెస్టు చేసి శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.