రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఇంఫాల్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 975.16 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 50.70 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికుడు ఇంఫాల్ నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.