MP Raghunandan Rao | యువతకు లక్షల్లో, కోట్లల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అవి అమలు చేయకుండా కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసి కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
మీడియాతో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఆయన ఎవరో మాట్లాడిర్రు.. మిర్చీ, బజ్జీలు వేసుకుంటే కూడా ఉద్యోగమేనా.. అని మరి గప్చుప్ల బండి, గోకుల్చాట్లకు పోతే తెలుస్తది. గోకుల్ చాట్ కౌంటర్ రోజు లక్ష రూపాయలుంటది. నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే రోజు లక్ష రూపాయలు రావు ఏ ఉద్యోగస్తునికి కూడా. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ (స్వయం ఉపాధి) కూడా ఒక రకంగా ఉద్యోగమే.. అన్నారు. నిరుద్యోగులు మిర్చి బండి పెట్టుకుంటే తప్పేంటి..? గోకుల్ చాట్ కౌంటర్ ఒక్క రోజుకి లక్ష రూపాయలు ఉంటది.. ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువ సంపాదించవచ్చు అంటూ ఎంపీ రఘునందన్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నిరుద్యోగులు మిర్చి బండి పెట్టుకుంటే తప్పేంటి?
గోకుల్ చాట్ కౌంటర్ ఒక్క రోజుకి లక్ష రూపాయలు ఉంటది
ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువ సంపాదించవచ్చు
– బీజేపీ ఎంపీ రఘునందన్ రావు pic.twitter.com/6dAZ9yVuNj
— Telugu Scribe (@TeluguScribe) June 6, 2026
Good news | వైద్య నిపుణులకు గుడ్ న్యూస్.. తిరుమలలో ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవలు ప్రారంభం
ప్రజల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి : నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర