ఎర్రగడ్డ, ఆగస్టు 11: ఎర్రగడ్డ ఫ్లైవర్ వంతెన కింద ఉన్న నల్లపోచమ్మ దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజల అనంతరం తొట్టెల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు వన భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. ఆషాఢ బోనాలు ముగిసిన తర్వాత తొట్టెల ఊరేగింపును జరపటం ఇక్కడ ఆనవాయితీ.
బోనాలు సమర్పించిన భక్తులకు, శివసత్తులకు ఆలయ కమిటీ అధ్యక్షుడు గంట మల్లేష్ జ్ఞాపికలను అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు రొంపి ప్రభాకర్, గంట శ్రీనివాస్, ఆర్.శ్రీరాం, నరసింహారావు, నర్సింగ్రావు, పి.సంతోష్, తరుణ్, కె.రాజేష్, వై.చంద్రశేఖర్, వాసు, నరేష్ పాల్గొన్నారు.