ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ ఆస్తిపన్ను వసూలు ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. చివరి ఐదురోజుల్లో అంటే ఈనెల 31 వరకు రూ.400 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నిర్థారిత లక్ష్యం రూ.1900 కోట్లకుగానూ శుక్రవారం వరకు రూ.1503.13 కోట్లు వసూలు చేసింది. రానున్న ఐదు రోజల్లో రూ.400 కోట్లు రాబట్టేందుకు చెల్లింపుదారుల సెల్ఫోన్లకు సంక్షిప్త సమాచారం పంపుతున్నారు. వీటితోపాటు ఎఫ్ఎం రేడియో, టీవీ చానళ్లలో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఆదివారం సెలవు అయినప్పటికీ జీహెచ్ఎంసీ సిటీజన్ సర్వీస్ సెంటర్లను తెరిచి ఉంచాలని నిర్ణయించింది.
ఓటీఎస్ను వినియోగించుకోవాలి
2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకాయిలపై విధించిన వడ్డీపై 90 శాతం మాఫీ చేసే వన్టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) స్కీంను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆస్తిపన్ను బకాయిలను మార్చి 31వ తేదీలోగా చెల్లించాలని జీహెచ్ఎంసీ నగరపౌరులకు విజ్ఞప్తి చేసింది.