రూ.3కోట్ల నిధులు విడుదల
కొనసాగుతున్న టెండరింగ్ ప్రక్రియ
త్వరలో ప్రారంభం కానున్న పనులు
అబిడ్స్, ఏప్రిల్ 2: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మసీదుల అభివృద్ధి, ఫుట్పాత్లు,మ్యాన్హోళ్ల మరమ్మతులు, వాటి ఎత్తును పెంచడం తదితర పనులను చేపట్టేందుకు గాను రూ.3కోట్ల వరకు నిధులు విడుదలయ్యాయి. రంజాన్ పండుగను పురస్కరించుకుని మసీదుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు గాను ప్రత్యేకంగా నిధులను కేటాయించారు.జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని 12,13 ,14,17,18 సర్కిల్ కార్యాలయాల పరిధిలో ఆయా అభివృద్ధి పనులను చేపట్టేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ జోనల్ కమిషనర్ రవికిరణ్ పర్యవేక్షణలో ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ నేతృత్వంలో సర్కిల్ల వారీగా పనులను త్వరలో ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అధికారులు టెండర్ ప్రక్రియను చేపడుతున్నారు. ఈ ప్రక్రి య పూర్తి కాగా నే పనులను ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. రంజాన్ ఆదివారం నుంచి ప్రారం భం కానుండడంతో విడుదలైన నిధులతో పనులను చేపట్టేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
త్వరగా పనులను పూర్తి చేయిస్తాం
రంజాన్ను పురస్కరించుకుని విడుదలైన నిధులతో మసీదుల్లో అభివృద్ధి పను చేస్తాం. టెండరింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే వెంటనే పనులను ప్రారంభింప చేసి త్వరా పనులు పూర్తి చేసేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. –సహదేవ్ రత్నాకర్, ఎస్ఈ