ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
నార్నూర్లో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
నార్నూర్, ఏప్రిల్7: రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో బుధవారం నాఫెడ్, మార్క్ఫెడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ నాందేవ్కాంబ్లేతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ..రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రైతులు పండించే పంటను కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రంలో ఎలాంటి స మస్యలు రాకుండా చూసుకోవాలని సంబంధితశాఖ అధికారులకు సూచించారు. అనంతరం డీఎం పుల్లయ్య మా ట్లాడుతూ శనగలను ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. రైతులు పట్టాపాస్పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంక్ ఖాతా బుక్ జిరాక్స్లను వెంట తీసుకొని రావాలని సూచించారు. ఎంపీపీ కనక మోతుబాయి. ఏవో గిత్తే రమే శ్, డీసీవో శ్రీనివాస్, డీసీఏవో మోహన్, ఎంపీటీసీ కే. పరమేశ్వర్, సహకార సంఘం వైస్ చైర్మన్ ఆడె సురేశ్, సర్పం చ్ బానోత్ గజానంద్ నాయక్, ఎంపల్లి సర్పంచ్ గోవింద్నాయక్, కోఆప్షన్ సభ్యుడు దస్తగిరి, మార్కెట్ కమిటీ మా జీ చైర్మన్ షేక్ దాదే అలీ, డైరెక్టర్ కాంతారావ్ దుర్గే, మహిళ సంఘం నాయకురాలు రాథోడ్ దేవ్కాబా యి, నాయకులు రాథోడ్ ఉత్తమ్, హైమద్, మహేందర్, యశ్వంత్రావ్, సత్తార్, ఫిరోజ్ ఖాన్, వ్యవసాయ సిబ్బంది ఉన్నారు.
అన్ని వర్గాల పండుగలకూ సమప్రాధాన్యం
ఇంద్రవెల్లి, ఏప్రిల్7: అన్ని వర్గాల పండుగలతోపాటు ఉత్సవాలకు రాష్ట్ర సర్కారు సమ ప్రాధాన్యమిస్తున్నదని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి అన్నారు. మండలకేంద్రంలోని హోలీ ట్రినిటీ చర్చి(దేవాలయ) జూబ్లీ వేడుకలు, గురుపట్టాభిషేకం కార్యక్రమంలో బుధవారం వారు పాల్గొన్నారు. వీరికి పుష్పగుచ్ఛం అందజేసి, ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కులాలకు చెందిన సంస్కృతీసంప్రదాయలను ప్రభుత్వం గుర్తించి, ఉత్సవాల నిర్వహణకు నిధులు మంజూరు చేస్తున్నదని గుర్తు చేశారు. ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, గిత్తె ఆశాబాయి, నాయకులు కాటం రమేశ్, మహేందర్ దుర్గే, అనిల్ రాథోడ్, విజయ్కుమార్, సుందర్, సంతోష్, నార్నూర్ ఎస్ఐ విజయ్కుమార్, క్రిస్టియన్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అన్ని పార్టీలతో చర్చల అనంతరమే ఆంక్షలు : సంజయ్ రౌత్