హైదరాబాద్ : బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్లో మేయర్ గద్వాల విజయలక్ష్మీ గురువారం ఉదయం పర్యటించారు. స్థానికంగా ఉన్న బస్తీ దవఖానాలో కరోనా పరీక్ష కేంద్రం, ఓపీ సేవలను మేయర్ పరిశీలించారు. అనంతరం బస్తీ దవఖానా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జీహెచ్ఎంసీ అధికారులను మేయర్ ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించి కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.